Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు

Update: 2026-03-04 04:28 GMT

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. గంగవరం మండలం వై జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. కంటైనర్ ను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.

తిరుపతి వెళుతుండగా...
ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలను చేపట్టారు. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News