Amravathi : నేడు అమరావతిలో తొలిసారి

నేడు అమరావతిలో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించనున్నారు

Update: 2026-01-26 02:50 GMT

నేడు అమరావతిలో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రాయపూడి వద్ద...
ఉదయం 8:30 గంటలకు అమరావతి రాయపూడి దగ్గర జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఏపీ మండలిలో ఉ.8 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఉ.8:15 గంటలకు ఏపీ అసెంబ్లీలో జెండా ఆవిష్కరణ ఉంటుంది. ఉదయం 10 గంటలకు ఏపీ హైకోర్టు దగ్గర జెండా ఎగరవేయనున్నారు.


Tags:    

Similar News