Chandrababu : పవన్ కల్యాణ్ శాఖపై చంద్రబాబు అసంతృప్తి

రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు

Update: 2026-03-12 07:28 GMT

రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ... ఫారెస్ట్ మారలేకపోతోందంటూ సీఎం కామెంట్ చేశారు. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలని కోరారు. నాలుగోసారి సీఎంగా చేస్తున్నానని, కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడానని, మళ్లీ మరోసారి మాట్లడతానని చెప్పారు. పోలీసు డిపార్ట్మెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా మారింది కానీ ఫారెస్టు డిపార్టుమెంట్ పీపుల్ ఫ్రెండ్లీగా లేరని చెప్పారు.

కలెక్టర్లు చెప్పినట్లు పనిచేయాలని...
గ్రీన్ కవర్ పెంచాలని, బయోడైవర్సిటీకి వెళ్లాలని, ప్రజలు ఆహ్లాదంగా పర్యటించేందుకు ఉపయుక్తంగా పరిస్థితులు మారాలని, ఫారెస్టు అధికారులు జిల్లా కలెక్టర్ కిందే పనిచేయాలని గుర్తుంచుకోవాలన్నారు. కలెక్టర్లు చెబుతున్నా... అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనలకు అనుగుణంగానే పర్యావరణహిత ప్రాజెక్టులకు సహకరించాలని చంద్రబాబు అన్నారు. సర్వే చేస్తున్న సమయంలో ప్రైవేటు, అటవీ, ఎండోమెంట్ తదితర క్లాసిఫికేషన్ల ప్రకారం రిజర్వు ల్యాండ్ ను గుర్తించాలని, కొందరు అటవీ శాఖ అధికారుల ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ఎలా అని ప్రశ్నించారు. శ్రీశైలంలో వస్తున్న భక్తులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారని, ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. బద్వేలులోనూ అటవీ శాఖ ఇదే తరహాలో అటవీశాఖ వ్యవహరించిందని చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.






Tags:    

Similar News