ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలివే

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ప్రారంభమయింది

Update: 2026-04-10 05:54 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులలో చర్చిస్తున్నారు. ఎస్ఐపీబీలో చ‌ర్చించిన పెట్టుబ‌డుల‌కు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. మొత్తం 39 వేల కోట్ల రూపాయల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది.

రుషికొండ ప్యాలెస్ పై...
మరొకవైపు ఎఫ్ఆర్సీ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. సమావేశం ప్రారంభమయిన వెంటనే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Tags:    

Similar News