నేడు విశాఖకు రాజ్‌నాథ్‌సింగ్

ఈరోజు విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించనున్నారు

Update: 2025-08-26 02:50 GMT

ఈరోజు విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటించనున్నారు. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలు ప్రారంభ కార్యక్రమానికి రాజ్ నాధ్ సింగ్ హాజరు కానున్నారు. తొలిసారి నౌకాదళంలోకి రెండు యుద్ధనౌకలను భారత నౌకాదళం తేనుంది. రాజ్ నాధ్ సింగ్ ఈరోజు విశాఖలో వీటిని ప్రారంభించనున్నారు.

యుద్ధనౌకలను...
కాగా ఈరోజు విశాఖలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్ నాధ్ సింగ్ పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రాజ్ నాధ్ సింగ్ విశాఖ పర్యటనలో నౌవికాదళ అధికారులతో కూడా సమావేశమవుతారని తెలిసింది.


Tags:    

Similar News