గాజువాకలో మంత్రి నారాయణ

విశాఖలోని గాజువాక‌లో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌ిస్తున్నారు

Update: 2026-03-17 05:40 GMT

విశాఖలోని గాజువాక‌లో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌ిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావుతో క‌లిసి ప‌లు అభివృద్ది ప‌నుల‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. గాజువాక జోన్ గార్బేజ్ ట్రాన్స్ ఫ‌ర్ స్టేష‌న్ ను ప‌రిశీలించిన మంత్రి నారాయ‌ణ‌, 76వ వార్డు హెచ్ బీ కాల‌నీలో అల్లూరి సీతారామ‌రాజు పార్కును ప్రారంభిచారు. ఈ సందర్భంగా నారాయ‌ణ‌ మాట్లాడుతూ న‌గ‌రంలో డంపింగ్ యార్డు అవ‌స‌రం లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్ కు త‌ర‌లిస్తున్నామని చెప్పారు. *గాజువాక‌లో 4.75 ఎక‌రాల్లో అన్ని ర‌కాల వ‌స‌తుల‌తో పార్కును ప్రారంభించామని గ‌త ప్ర‌భుత్వం మున్సిప‌ల్ శాఖ‌ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మునిసిపాలిటీల్లో ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌న్నులు ఇత‌ర అవ‌సరాల‌కు మ‌ళ్లించేసిందని నారాయణ తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం ప‌క్క‌దారి ప‌ట్టించిన 1700 కోట్లు నిధులు ఇంకా మునిసిపాలిటీల‌కు రాలేదన్నారు.

అందరికీ మంచినీరు...
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత మునిసిపాలిటీల నిధులు అక్క‌డే ఖ‌ర్చు చేసేలా గ్రీన్ ఛాన‌ల్ తీసుకొచ్చామన్న మంత్రి నారాయణ రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందించేందుకు 14 వేల కోట్ల‌తో టెండ‌ర్లు పిలిచామని చెప్పారు. రాబోయే రెండేళ్ల‌లో మునిసిపాలిటీల్లో ప్ర‌తి ఇంటికీ స్వ‌చ్చ‌మైన తాగునీరు అందిస్తామని తెలిపారు. 5000 కోట్ల‌తో ప‌లు న‌గ‌రాల్లో ప‌క్కా డ్రెయిన్లు నిర్మిస్తున్నామని, కేంద్రం నుంచి వ‌చ్చే మ‌రో 4000 కోట్ల‌తో తాగునీరు,డ్రెయిన్లు,రోడ్లు,లైట్లు ఏర్పాటు చేస్తామని, మిష‌న్ మోడ్ లో మునిసిపాలిటీల‌ను అభివృద్ది చేసేలా ముందుకెళ్తున్నామని, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై రైట్స్ సంస్థ‌తో కేంద్రం స‌ర్వే చేయిస్తుందని, నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్ చేప‌డ‌తామని మంత్రి నారాయణ తెలిపారు.








Tags:    

Similar News