Andhra Pradesh : నేడు రోజు సీఐఐ సదస్సులో ఒప్పందాలివే

విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు భేటీ కానున్నారు

Update: 2025-11-15 03:33 GMT

విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సదస్సులో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు భేటీ కానున్నారు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రేమాండ్‌కు వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

పలు ప్రాజెక్టులతో...
శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ఏపీ టూరిజం విజన్ సెషన్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇవాళ పెద్ద ఎత్తున ఎంఓయూలు కంపెనీలు చేసుకోనున్నాయి.


Tags:    

Similar News