Chandrababu : రేపు విశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు
రేపు విశాఖలోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
రేపు విశాఖలోఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు ఏయూలో జరగనున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక వైద్య శిబిరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ఉండనుంది.
వివిధ కార్యక్రమాల్లో...
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్సుకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం విశాఖ నుంచి బయలుదేరి తిరిగి అమరావతికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.