ఆ మల్టీ స్టారర్ అసలు పట్టాలెక్కేనా?

Update: 2016-10-18 11:32 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక అర్ధ శతాబ్దం పైగా చరిత్ర కలిగిన కుటుంబం నందమూరి కుటుంబం. ఒక సామాజిక వర్గపు కథానాయకులకు పట్టం కట్టే రోజులలో ప్రేక్షకుల చూపును, అభిమానాన్ని తన వైపు తిప్పుకుని అగ్ర స్థాయి కి చేరిన నటుడు మెగా స్టార్ చిరంజీవి పరివారం మరో వైపు. ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది తారలు ప్రేక్షకులను అలరిస్తూ వారి కుటుంబ కీర్తి పెంచుతున్నారు. ఇప్పటి తరం కథానాయకులలో నందమూరి కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ లు అభిమాన సంఘాల అభిమానానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ అయ్యారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఐన క్రియేటివ్ కమెర్షియల్స్ అధినేత కే.ఎస్.రామారావు ఈ ఇద్దరి హీరోల తో ఒక మల్టీ స్టార్రర్ ప్లాన్ చేసారు. ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. కాగా ఇప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు రోజు రోజుకి సన్నగిల్లుతున్నాయి అని సమాచారం. దీనికి కారణం కథ ఇంకా పూర్తిగా తయారు కాకపోవటమే అని చెప్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా వుండే నటులతో కాల్ షీట్స్ తీసుకున్నాక కథ విషయంలోనే ఎక్కువ కాలం జాప్యం చేస్తే కష్టమే కదా మరి... కానీ ఈ చిత్రం మొదలు అవుతుందో లేక చర్చల దశలోనే ఆగిపోయిందో ఇంకా అధికారికంగా వార్త బైటకి రాలేదు.

అన్నీ కుదిరి ఈ చిత్రం పట్టాలెక్కితే, రెండు అగ్ర స్థాయి కుటుంబాల నుంచి నేటి తరం నటులతో వచ్చే మల్టీ స్టార్రర్ కావటం వలన ప్రేక్షకులలోనూ, అభిమానులలోనూ ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పుతుంది అని ఆశిస్తున్నారు సినీ జనం.

Similar News