బ్రేకింగ్ : జగన్ కు మోదీ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మోదీ జగన్ తో చర్చించారు. లాక్ డౌన్ [more]

Update: 2020-04-05 14:20 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మోదీ జగన్ తో చర్చించారు. లాక్ డౌన్ అమలుపై కూడా జగన్ తో మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని ఎంతమందిని క్వారంటైన్ చేయగలిగారు? ఇంకా ఎంతమంది అందుబాటులోకి రాలేదన్న విషయాలను మోదీ జగన్ తో చర్చించినట్లు తెలిసింది. కాగా ఏపీలో కేసుల సంఖ్య 252కు పెరిగింది. ఇందులో జమాత్ కు వెళ్లి వచ్చిన వారే అధికంగా ఉన్నారని జగన్ మోదీకి వివరించినట్లు తెలిసింది.

Tags:    

Similar News