బ్రేకింగ్ : ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరికి పాజిటివ్

ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో ప్రకాశం జిల్లాలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 17 కు చేరుకుంది. నిజాముద్దీన్ నుంచి వచ్చిన [more]

Update: 2020-04-02 04:39 GMT

ప్రకాశం జిల్లాలో మరో ఇద్దరికి కరోనా సోకింది. దీంతో ప్రకాశం జిల్లాలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 17 కు చేరుకుంది. నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారిలో మొత్తం 14 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ జిల్లాలో రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు. చీరాల నుంచి తొలుత ఒక వృద్ధుడి వైరస్ సోకింది. తర్వాత ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని కనుగొని పరీక్షించగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ జిల్లా నుంచే 130 మంది వరకూ ఢిల్లీ వెళ్లి వచ్చారు. మరో 40 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. మొత్తం మీద ప్రకాశం జిల్లా పై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 113కి చేరింది.

Tags:    

Similar News