600కు చేరువలో… మృతుల సంఖ్య కూడా?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరుకుంది. 17 మంది మృతి చెందారు. ఎక్కువగా [more]

Update: 2020-04-14 03:02 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరుకుంది. 17 మంది మృతి చెందారు. ఎక్కువగా హైదరాబాద్ లోనే కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. నగారంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 17 జోన్లను గుర్తించి అక్కడ ఇన్ ఛార్జులుగా ఐఏఎస్ అధికారులను నియమించారు. వారి పర్యవేక్షణలో అక్కడ లాక్ డౌన్ అమలు జరగనుంది. తెలంగాణలో 472 యాక్టివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటికి 103 మంది డిశ్చార్జి అయ్యారు.

Tags:    

Similar News