ఏంటి మహేశా ఇది?

ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నదో.. లేదో.. ఎవరికి అర్ధం కావడం లేదు. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ తర్వాత వంశి పైడిపల్లి తో కలిసి [more]

Update: 2020-03-11 05:33 GMT

ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో ఉన్నదో.. లేదో.. ఎవరికి అర్ధం కావడం లేదు. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ తర్వాత వంశి పైడిపల్లి తో కలిసి మరో మూడు నెలలో సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే అనుకోకుండా మహేష్ మధ్యలోనే వంశి పైడిపల్లి సినిమాని ఆపేసాడు. ఆ సినిమా ఎందుకు ఆగింది అనేది ఎవరికీ తెలియదు కానీ.. మహేష్ చిరు ఆచార్య సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే టాక్ ప్రచారంలోకొచ్చిది. అది నిజామా.. కదా.. అనేది మహేష్ టీం నుండి క్లారిటీ రాలేదు.

అయితే తాజాగా మహేష్ బాబు హిమాలయాలను సందర్శించాడానికి వెళుతున్నాడనే న్యూస్ ఉంది చూశారూ.. దానితో మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ వయసులో మహేష్ హిమాలయాకు ఎందుకు.. సినిమాలు చేసుకోక అంటూ తెగ ఇదై పోతున్నారు. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేవు.. ఏ దర్శకుడు మంచి కథతో మహేష్ ఇంప్రెస్స్ చేయలేక గడువు అడుగుతున్నారు. దానితో మహేష్ ప్రస్తుతం ఖాళీ. అందుకే ఈ గ్యాప్ లో ఓ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని…. అందుకోసం మహేష్ హిమాలయాలను ఎంచుకున్నాడని టాక్. అయితే కోలీవుడ్ సీనియర్ హీరో రజినీకాంత్ ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలను సందర్శిస్తూ వార్తల్లో ఉన్నట్లుగా.. ఇప్పుడు మహేష్ కూడా ఇలా హిమాలయాలంటూ హాట్ టాపిక్ కి తెరలేపాడు.

Tags:    

Similar News