గంటా గీత దాటినట్లుందే

గంటా శ్రీనివాసరావు మరోసారి గీత దాటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో జరిపిన లాంగ్ మార్చ్ కు హాజరవ్వాలని గంటా శ్రీనివాసరావును టీడీపీ అధినేత చంద్రబాబు [more]

Update: 2019-11-04 12:50 GMT

గంటా శ్రీనివాసరావు మరోసారి గీత దాటారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో జరిపిన లాంగ్ మార్చ్ కు హాజరవ్వాలని గంటా శ్రీనివాసరావును టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబుకు పవన్ ఫోన్ చేసి తమ లాంగ్ మార్చ్ కు మద్దతివ్వాలని కోరారు. దీంతో చంద్రబాబు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులను పవన్ లాంగ్ మార్చ్ కు వెళ్లాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ ముగ్గురు లాంగ్ మార్చ్ కు హాజరవుతారని పవన్ కూ తెలిపారు. అయితే లాంగ్ మార్చ్ కు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడులు మాత్రమే హాజరయ్యారు. విశాఖపట్నంలోనే ఉన్న గంటా శ్రీనివాసరావు మాత్రం లాంగ్ మార్చ్ కు దూరంగా ఉన్నారు. ఇది టీడీపీలో హాట్ టాపిక్ అయింది. చిరంజీవికి సన్నిహితంగా ఉండే గంటా శ్రీనివాసరావు పవన్ కల్యాణ్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

Tags:    

Similar News