శారీరకంగా..మానసికంగా వేధిస్తున్నారు

ప్రతిపక్ష నేతలను మానసికంగా, శారీరకంగా వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు టెలికాన్ఫరెస్స్ లో ఆయన నేతలతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం [more]

Update: 2019-10-18 05:23 GMT

ప్రతిపక్ష నేతలను మానసికంగా, శారీరకంగా వైసీపీ ప్రభుత్వం వేధిస్తుందని ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు టెలికాన్ఫరెస్స్ లో ఆయన నేతలతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిలయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం రద్దులు చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనినీ చేయలేదని అన్నారు. టీడీపీ క్యాడర్ ధైర్యం కోల్పోకుండా చూడాలన్నారు. రాష్ట్రాన్ని పెద్దయెత్తున లూటీ చేస్తున్నారని, చివరకు ప్రశ్నించిన మీడియాను కూడా బెదిరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆర్థిక వ్యవస్థను జగన్ సర్వనాశనం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదమంటూ నిందలు వేస్తున్నారన్నారు.

Tags:    

Similar News