కుట్రతోనే మా వాళ్లను లాక్కుంటున్నారు

తెలుగుదేశం పార్టీపై కుట్రలో భాగంగానే తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా [more]

Update: 2019-02-14 10:21 GMT

తెలుగుదేశం పార్టీపై కుట్రలో భాగంగానే తమ ఎంపీలు, ఎమ్మెల్యేలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగి, తన వద్ద అన్ని పనులూ చేయించుకొని ఇప్పుడు నీచాతినీచంగా పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. నిన్న ఎమ్మెల్యే వెళ్లి జగన్ ను కలిశారని, ఇవాళ మరొకరు వెళుతున్నారని, ఇలా వెళ్లే వారిని చూసి తాను భయపడనని స్పష్టం చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి భయపడుతున్నారని ఆరోపించారు. ఎవరు పార్టీని వీడినా నిజమైన ప్రజా సేవకులు కార్యకర్తలు, సీబీఎన్ ఆర్మీనే పేర్కొన్నారు.

Tags:    

Similar News