బ్రేకింగ్ : ఏపీ డీజీపీ పై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకోవడం, పోలీసులు సీఆర్పీసీ 151 కింద నోటీసులు జారీ చేయడంపై డీజీపీని [more]

Update: 2020-03-12 11:38 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకోవడం, పోలీసులు సీఆర్పీసీ 151 కింద నోటీసులు జారీ చేయడంపై డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలను తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని అమరావతిలో 144 సెక్షన్, అక్రమ కేసుల నమోదుపై కూడా సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలేంటని డీజీపీని నిలదీసింది. చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అడ్డుకున్న కేసులో విచారణకు డీజీపీ గౌతం సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు.

Tags:    

Similar News