బాబు…. మరో కోణం చూడకు

కోడెల ఆత్మహత్యను టీడీపీ నాయకులు రాజకీయం చేద్దామని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల ఆత్మహత్య కేసులో సిబిఐ విచారణ జరపాలంటూ టీడీపీ చేస్తున్న [more]

Update: 2019-09-20 11:44 GMT

కోడెల ఆత్మహత్యను టీడీపీ నాయకులు రాజకీయం చేద్దామని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల ఆత్మహత్య కేసులో సిబిఐ విచారణ జరపాలంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై అంబటి స్పందించారు. కోడెల ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు బాబు ఏమి పట్టించుకోలేదని, చంద్రబాబులో అలాంటి భావోద్వేగాలు కనిపించలేదన్నారు అంబటి. కోడెలలోని చెడుకోణాన్ని చెప్పించే విధంగా చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిపై కేసులు వచ్చినా నమోదు చేయడం పోలీసుల ధర్మమమన్నారు. కోడెలపై కేసులు నమోదయ్యయే తప్ప దర్యాప్తు జరుగుతుండడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయం గుర్తించాలన్నారు అంటి రాంబాబు.

 

 

Tags:    

Similar News