హైదరాబాద్ లో ప్రియాంక

Update: 2017-02-19 02:50 GMT

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చారు. ప్రియాంక కుమారుడు రైహన్ కు కంటి చికిత్స చేయించుకునేందుకు ప్రియాంక ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు వచ్చారు. ప్రియాంక, రాబర్ట్ వాద్రా, రైహన్ లు దాదాపు రెండు గంటల పాటు ఎల్వీ ప్రసాద్ నేత్రాలయంలోనే ఉన్నారు. రైహాన్ కు కంటి పరీక్షలు అక్కడి వైద్యులు నిర్వహించినట్లు తెలుస్తోంది. రైహన్ ఇటీవల క్రికెట్ ఆడుతుండగా కంటి కింద గాయమవ్వడంతో... కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి సూచన మేరకు ప్రియాంక దంపతులు ఇక్కడికి వచ్చినట్లు చెబుతున్నారు.

ప్రియాంక వెంట సుబ్బారామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి ఉన్నారు. ప్రియాంక దంపతులు ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రియాంక రాకను అత్యంత గోప్యంగా ఉంచారు. కాంగ్రెస్ నేతలు కొందరు ప్రియాంకను కలసేందుకు వచ్చినా అందుకు ఆమె నిరాకరించినట్లు తెలిసింది.

Similar News