హైకోర్టును ఆశ్రయించిన కేవీపీ

Update: 2017-11-21 10:41 GMT

పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పిటీషన్ వేశారు. పోలవరం ప్రాజెక్టుపై పూర్తి ఖర్చును కేంద్రప్రభుత్వమే భరించాలని కేవీపీ పిటీషన్ లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. 2014 ఏప్రిల్ 1వ తేదీ ఉన్న అంచనాలనే భరిస్తామన్నకేంద్ర ప్రభుత్వ వాదన సరికాదన్నారు. ఏపీ విభపన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ఖర్చును భరించాలని కోరారు. కేవీపీ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను డిసెంబరు 19వ తేదీకి వాయిదా వేసింది.

Similar News