అజ్ఞాత మావోయిస్ట్ అగ్రనేత జినుగు నరసింహ రెడ్డి అలియాస్ జంపన్న హైద్రాబాద్ లో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం....పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి గా విధులు నిర్వహిస్తున్న జంపన్న పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత విబేధాలు....అనారోగ్య సమస్యలతో తన భార్య హింగే రజిత తో కలిసి లొంగిపోయిన ట్లు తెలుస్తోంది.... మహబూబాద్ జిల్లా తొర్రురు మండలం చెర్లపాలెం కు చెందిన జంపన్న 40ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్ వార్ లో చేరి పార్టీలో అంచలంచలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. జంపన్న మీద కోటిరూపాయల రివార్డు ఉంది.