ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందలేదు. రెండు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. డిసెంబర్ 15వ తేదీన ఉభయ సభలూ ప్రారంభమయ్యాయి. అయితే లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో మాత్రం విపక్షాలు ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి అప్పగించాలని పట్టు బట్టారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో రాజ్యసభను కూడా నిరవధికంగా వాయిదా వేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ఈ సమావేశాల్లో రాజ్యసభలో ఆమోదం పొందలేదు. దీంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చదు.