ఏపీ హక్కుల కోసం పోరాడతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణనుకలిశారు. ప్రత్యేక హోదా, ఏపీ విభజన అంశాలను అమలు చేసేందుకు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఏర్పాటు చేయాలన్న తన ఆలోచనను జేపీ ముందుంచారు. లోక్ సత్తా కార్యాలయానికి వెళ్లిన పవన్ జేఏసీ ఏర్పాటులో ఆయన మద్దతును కోరారు.సమావేశం ప్రస్తుతం జరుగుతుంది. అందరినీ కలుపుకుని ఏపీ హక్కులను సాధించాలని పవన్ నిర్ణయించిన సంగతి తెలసిందే.