జక్కన్న అక్టోబర్‌ 12న చలో లండన్

Update: 2017-09-21 05:14 GMT

అమరావతి డిజైన్ల కసరత్తుకు అక్టోబర్‌ 12-13 తేదీలలో లండన్‌ టూర్‌ ఫిక్స్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మూడు దఫాలుగా జరిగిన చర్చల్లో రాజమౌళి పలు అంశాలను చర్చించారు. ఇప్పటి వరకు రూపొందించిన డిజైన్లతో పాటు నార్మన్ ఫోస్టర్‌ ప్రతినిధులతో రాత్రి పొద్దుపోయే వరకు రాజమౌళి డిస్కస్‌ చేశారు. డిజైన్ల ఎంపికలో పాలు పంచుకోడానికి రాజమౌళి కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి డిజైన్లలో రాజమౌళిని భాగస్వామిని చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజమౌళి కేవలం ఐడియా ఇస్తారని., డిజైన్‌ కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. లండన్‌ వెళ్లే లోపు వీలైనన్ని సార్లు చర్చలు జరుపుతామని, వజ్రాకరం., స్థూపాకారాల కంటే మంచి కాన్సెప్ట్‌లు వస్తే వాటిని అమోదిస్తామని చెప్పుకొచ్చారు. డిజైన్లను ఖరారు చేయడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆ తర్వాతే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అక్టోబర్‌ 15నాటికి అన్ని రోడ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేస్తామని మంత్రి ప్రకటించారు.

Similar News