గుప్త నిధుల కోసం 5గురు యువతుల బలి?

Update: 2017-11-22 13:55 GMT

గుప్త నిధుల,తాంత్రిక శక్తుల కోసం ఐదుగురు అమ్మాయిలు బలయ్యారు. ఆధునిక కాలంలో కూడా ముఢనమ్మకాలతో కొనసాగుతున్న విష సంస్కృతి ఇది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూల్ జిల్లా వటవర్ల పల్లి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అక్క మహాదేవి గుహలలో ఈ ఘటన చోటు చేసుకుంది. బలి అయిన అమ్మాయిల వయసు 30 లోపే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అక్క మహాదేవి గుహల్లో భారీగా గుప్త నిధులు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఐదు రోజుల క్రితం ఈ గుహల వద్ద ఐదు పుర్రెలు, ఎముకలు, నిమ్మకాయలు, దుస్తులు, చెప్పులు ఉన్నాయని పశువుల కాపర్లు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కొందరు గుప్త నిధుల కోసం తాంత్రిక శక్తులు పొందడానికి ఐదుగురు అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి బ్లేడుతో కోసి ఆ మృతదేహాలను గుహల్లో పడేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే జంతువులు శవాలను తినేయడంతో పుర్రెలు, ఎముకలు మిగిలాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News