ఏపీ పరిస్థితులపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరాతీశారు. గత మూడు రోజులుగా టీడీపీ ఎంపీలు నిరసనలు చేస్తుండటంతో సోనియా గాంధీ టీడీపీ ఎంపీలు కేశినేని నాని, తోట నరసింహం, రామ్మోహన్ నాయుడులను పిలిపించుకుని మాట్లాడారు. ఏపీలో ఉన్న పరిస్థితులను అడిగారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో ఉన్న హామీలను అమలుపర్చకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు సోనియాకు వివరించారు. అయితే ఈ సందర్భంగా సోనియా ఆంధ్ర ప్రదేశ్ కు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.