తెలుగు సినిమా పరిశ్రమకు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. సంక్రాంతికి విడుదలయిన సినిమాల నిర్మాతల ఇళ్లు, ఆఫీస్ లపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈరోజు ఉదయం నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. నిర్మాతలు సి. కల్యాణ్, రాధాకృష్ణలతో పాటు మరో ఆరుగురు నిర్మాతల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రాధాకృష్ణ పవన్ కల్యాణ్ తో అజ్ఞాత వాసి సినిమా తీశారు. అలాగే సి. కల్యాణ్ బాలకృష్ణ నటించిన జై సింహాను నిర్మించారు. ఈ నేపథ్యంలో భారీ వసూళ్లు చేశాయని భావించిన ఐటీ శాఖ అధికారులు ఈ నిర్మాతల ఇళ్లు, ఆఫీస్ లపై దాడులు చేస్తున్నారు.