బ్రేకింగ్ : త్వరలో అన్ని విషయాలపై స్పష్టత ఇస్తా

వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టే విషయం వైఎస్ అభిమానులతో చర్చించకుండా పెట్టనని షర్మిల చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల నేతలతో [more]

Update: 2021-02-09 07:12 GMT

వైఎస్ షర్మిల నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పెట్టే విషయం వైఎస్ అభిమానులతో చర్చించకుండా పెట్టనని షర్మిల చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల నేతలతో తాను మాట్లాడతానని తెలిపారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేందుకే ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని షర్మిల చెప్పారు. ఎందుకు లేదన్నదే తన ఆలోచన అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పారు. వరసగా జిల్లాల నేతలతో షర్మిల సమావేశం అవుతున్నారు.

Tags:    

Similar News