ఎంపీ ఇంట్లో కరోనాపై జగన్ ఆరా?

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో కరోనా పాజిటివ్ సోకింది. ఎంపీకి అన్నదమ్ముల కుటుంబంలో ఈ వ్యాధి సోకడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా [more]

Update: 2020-04-27 02:40 GMT

కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కుటుంబంలో కరోనా పాజిటివ్ సోకింది. ఎంపీకి అన్నదమ్ముల కుటుంబంలో ఈ వ్యాధి సోకడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు. అయితే వీరంతా వైద్యులే కావడం విశేషం. ఎంపీ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ సోకడంతో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సంజీవ్ కుమార్ కు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలిసింది. వ్యాధి సోకడానికి గల కారణాలను జగన్ అడిగినట్లు తెలిసింది. భయపడాల్సిన పనిలేదని, త్వరలోనే వారంతా కోలుకుంటారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News