వారికోసం వాటిని సిద్ధం చేయండి

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఏ మాత్రం ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి [more]

Update: 2020-03-28 11:58 GMT

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఏ మాత్రం ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి ప్రవేశిస్తామంటే అందుకు 14 రోజులు క్వారంటైన్ కు సిద్ధపడాల్సిందేనని జగన్ తెలిపారు. ఇందుకోసం సరిహద్దు ప్రాంతంలోని కల్యాణ మండపాలను, హోటళ్లను సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. వాటిని క్వారంటైన్ సెంటర్లుగా వినియోగించాలన్నారు. సరిహద్దుల్లోనే ఉంచి తర్వాత పరీక్షలు జరిపి రాష్ట్రంలోకి అనుమతించాలని జగన్ కోరారు. వీటి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ఇక వలస కూలీల పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.

Tags:    

Similar News