గవర్నర్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం ముగిసింది. దాదాపు నలభై నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. గవర్నర్ కోటాలో నాలుగు [more]

Update: 2021-06-14 12:39 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశం ముగిసింది. దాదాపు నలభై నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలపైన చర్చ జరిగినట్లు తెలిసింది. క్రిమినల్ కేసులున్నాయని గవర్నర్ ఇద్దరి పేర్లకు అభ్యంతరం తెలపడంతో దానిపై జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు గవర్నర్ ఆమోదం తెలుపుతారని తెలుస్తోంది.

Tags:    

Similar News