జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల సందర్భంగా [more]

Update: 2021-02-05 03:37 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. 2014 ఎన్నికల సందర్భంగా జాతీయ రహదారిపై అనుమతి లేకుండా ప్రచారం చేశారన్న దానిపై కేసు నమోదయింది. ఈ కేసులో జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కోర్టులో పిటీషన్ దాఖలయింది. ఈ కేసులో జగన్ ను ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసులో అప్పటి నుంచి జగన్ కోర్టుకు హాజరుకాకపోవడంతో తాజాగా నాంపల్లి కోర్టు జగన్ కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు రావాలని కోరింది.

Tags:    

Similar News