జగన్ ఉగాది కానుక ఇదే

ఉగాది నాటికి అందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈమేరకు ఈరోజు ఉదయం పది గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై [more]

Update: 2019-08-14 02:05 GMT

ఉగాది నాటికి అందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈమేరకు ఈరోజు ఉదయం పది గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖపై చర్చించనున్నారు. భూముల రీసర్వేతో పాటుగా ఉగాది నాటికి ఇళ్ల స్థలాలను అందరికీ ఇచ్చేలా కార్యాచరణను రూపొందించాలని జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈరోజు అర్బన్ హౌసింగ్ తో పాటు, గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో కూడా జగన్ భేటీ అవుతున్నారు.

Tags:    

Similar News