పేదలను ఆదుకోవడమే లక్ష్యం

కాపు నేస్తం ద్వారా నిరుపేద మహిళలను ఆదుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రెండేళ్లలో 900 కోట్లను చెల్లించామని జగన్ తెలిపారు. [more]

Update: 2021-07-22 06:33 GMT

కాపు నేస్తం ద్వారా నిరుపేద మహిళలను ఆదుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రెండేళ్లలో 900 కోట్లను చెల్లించామని జగన్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశ్యమని జగన్ అన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే కుటుంబాలు బాగుపడతాయని జగన్ అభిప్రాయపడ్డారు. 3,27,000 మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని జగన్ తెలిపారు. కోవిడ్ తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా సంక్షేమ పథకాల నిధులను ఆపడం లేదని జగన్ తెలిపారు.

Tags:    

Similar News