ఎమ్మెల్యే రజనీ కారుపై దాడి

వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీకారుపై దాడి జరిగింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కోటప్ప కొండ వెళుతుండగా ఆమె కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి [more]

Update: 2020-02-21 02:59 GMT

వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీకారుపై దాడి జరిగింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కోటప్ప కొండ వెళుతుండగా ఆమె కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ దాడి ఎవరు చేశారన్న దానిపై సమాచారం లేదు. దాడి సమయంలో రజనీ భర్త, మరిది కూడా కారులో ఉన్నారు. టీడీపీ నేతలే దాడికి దిగారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీలో ఉన్న గ్రూపు విభేదాలే దాడికి కారణమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడి సమయంలో రజనీ ఆ కారులో లేకపోవడంతో ఆమె ఉందనే దాడికి దుండగులు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.

Tags:    

Similar News