జానారెడ్డి చేయకపోతే.. ఇంకెవరు చేశారు?

నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని జానారెడ్డి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్ నియోజకవర్గంలో గత [more]

Update: 2021-04-05 01:05 GMT

నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని జానారెడ్డి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News