వారికి ఆహ్వానం..వస్తారా?

రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ థాక్రేతో పాటు మరికొందరు మంత్రులు రేపు ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత మంత్రి వర్గ [more]

Update: 2019-11-27 13:49 GMT

రేపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ థాక్రేతో పాటు మరికొందరు మంత్రులు రేపు ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంతో పాటు మరో పదిహేను మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ థాక్రే తన ప్రమాణస్వీకారానికి బీజేపీ అగ్రనేతలు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను స్వయంగా ఆహ్వానించారు. సోనియాగాంధీతో పాటు ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అట్టహాసంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News