నిమ్మగడ్డ పిటీషన్ పై నేడు విచారణ… తీర్పుపై ఉత్కంఠ

ఏపీ ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. ఈరోజు దీనిపై హైకోర్టు విచారణ జరపనుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు [more]

Update: 2021-01-12 01:50 GMT

ఏపీ ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. ఈరోజు దీనిపై హైకోర్టు విచారణ జరపనుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. కరోనా వ్యాక్సిన్ ఉన్నా ఎలా ఎన్నికలను నిర్వహించవచ్చో ఈరోజు ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ కు వివరించనుంది. దీనిపై నేడు వాదనలు విన్న తర్వాత డివిజనల్ బెంచ్ తీర్పు వెలువరించనుంది. డివిజనల్ బెంచ్ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News