తెలంగాణలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు [more]

Update: 2021-04-16 00:55 GMT

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు తెలంగాణలో రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆరు వారాల పాటు తెలంగాణకు కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కూడా కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేక పోయారు.

Tags:    

Similar News