ఏపీతో జగన్ పబ్బీ గేమ్

ఏపీ ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్ పబ్జీ గేమ్ ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికే జగన్ అధికారంలోకి వచ్చినట్లుందన్నారు. స్థానిక [more]

Update: 2020-02-03 13:38 GMT

ఏపీ ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్ పబ్జీ గేమ్ ఆడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికే జగన్ అధికారంలోకి వచ్చినట్లుందన్నారు. స్థానిక మీడియా రాజధాని అమరావతికి అనుకూలంగా వార్తలు రాస్తే సామాజిక వర్గం ముద్ర వేస్తున్నారన్నారు. జాతీయ మీడియాలో ఎడిటోరియల్స్ జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నానయన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ఆర్థికంగా నష్టమే తప్ప మరేమీ లేదన్నారు. విశాఖ, కర్నూలు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని చంద్రబాబు తెలిపారు. అన్ని రద్దులతోనే జగన్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులు చేస్తున్నారన్నారు. అన్నీ పథకాలను, కార్యక్రమాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

Tags:    

Similar News