తెలంగాణలో ఎన్నికల ప్రచారం కుదింపు

తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయం కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30వ [more]

Update: 2021-04-21 01:33 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచార సమయం కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ప్రచార సమయాన్ని ఎన్నికల కమిషన్ కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే ప్రచారానికి అనుమతిస్తారు. తెలంగాణలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించడంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News