బాబు రాజకీయ దళారి

చంద్రబాబు ఒక రాజకీయ దళారి అని, ఆయన తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎంతటి నీచస్థితికైనా దిగజారతారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో [more]

Update: 2019-10-30 07:15 GMT

చంద్రబాబు ఒక రాజకీయ దళారి అని, ఆయన తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఎంతటి నీచస్థితికైనా దిగజారతారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను దోచుకున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఇసుక పాలసీని తీసుకువచ్చి పారదర్శకంగా సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. అయితే వర్షాలు, వరదలు ఇసుక సరఫరాకు అడ్డంకిగా మారాయని తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే ఇసుక సరఫరా సక్రమంగా జరుగుతుందన్నారు. చంద్రబాబు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికే ప్రయత్నిస్తున్నారన్నారు. కొద్దిరోజుల్లో ఎవరి పాలన ఏంటో స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్దారు. తమపై నిందలు వేయడం మానుకోవాలని శ్రీకాంత్ రెడ్డికోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించింది చంద్రబాబేనని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News