సోమిరెడ్డికి సోమవారమే

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు తమ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని ఇడిమేపల్లి గ్రామంలో భూవివాదం [more]

Update: 2019-09-07 03:19 GMT

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు తమ ఎదుట హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని ఇడిమేపల్లి గ్రామంలో భూవివాదం విషయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై సోమిరెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. శుక్రవారమే విచారణకు కావాలని పోలీసులు కోరినా సోమిరెడ్డి తనకు సమయం కావాలని కోరడంతో సోమవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు అందజేశారు.

Tags:    

Similar News