ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?

సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయడం దారుణమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. వైద్యం కోసం వచ్చే వారిని వెనక్కు తిప్పి పంపడమేంటన్నారు. ప్రాణాలను కాపాడుకోవడం [more]

Update: 2021-05-15 01:05 GMT

సరిహద్దుల్లో అంబులెన్స్ లను నిలిపివేయడం దారుణమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. వైద్యం కోసం వచ్చే వారిని వెనక్కు తిప్పి పంపడమేంటన్నారు. ప్రాణాలను కాపాడుకోవడం కోసమే వారు హైదరాబాద్ వస్తున్నారని, దీనికి నిబంధనలను పెట్టడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని రేవంత్ రెడ్డి కోరారు. లేకుంటే తెలంగాణ ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా కట్టడిలో కేసీఆర్ అసలు విషయాలను వదిలేసి కొసరు విషయాలను పట్టించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News