రాయపాటికి బిగ్ షాక్

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆస్తులను వేలం వేయాలని ఆంధ్రాబ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు వేలం నోటిఫికేషన్ ను ఆంధ్రాబ్యాంకు విడుదల చేసింది. మార్చి 23వ తేదీన [more]

Update: 2020-02-21 05:02 GMT

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆస్తులను వేలం వేయాలని ఆంధ్రాబ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు వేలం నోటిఫికేషన్ ను ఆంధ్రాబ్యాంకు విడుదల చేసింది. మార్చి 23వ తేదీన వేలం వేయనున్నట్లు ప్రకటించింది. రాయపాటి కంపెనీలు మొత్తం 837 కోట్ల రూపాయల బకాయి ఉన్నట్లు ఆంధ్రాబ్యాంకు నోటీసుల్లో పేర్కింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. గుంటూరు అరండల్ పేట లోని కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు. న్యూఢిల్లీలోని ద్వారకలోని ఫ్లాట్ ను కూడా వేలం వేయనున్నట్లు ఆంధ్రాబ్యాంకు నోటీసులో పేర్కింది. ఈ ఆస్తులు రాయపాటి కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News