రాష్ట్రపతి వద్దకు రాహుల్

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న [more]

Update: 2020-12-24 06:04 GMT

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులకు రాహుల్ గాంధీ మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా రెండు కోట్ల మంది సంతకాలు సేకరించారు. ఈ సంతకాలతో కూడిన వినతిని రాష్ట్రపతికి రాహుల్ గాంధీ అందజేయనున్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరూ విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ పాదయాత్రగా బయలుదేరారు. అయితే రాష్ట్రపతి భవన్ లోకి రాహుల్ గాంధీతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News