బ్రేకింగ్ : ఏ దేశంలోనూ ఇలా చేయలేదు

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. లాక్ డౌన్ ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. [more]

Update: 2020-05-26 07:00 GMT

కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. లాక్ డౌన్ ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వైరస్ పెరుగుతుంటే లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని చెప్పారు. లాక్ డౌన్ ఉద్దేశ్యం, లక్ష్యం నెరవేరలేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ ఎగ్జిట్ లో మోదీ ప్రభుత్వం పూర్తిా విఫలమయిందన్నారు. వలస కూలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం వారికి సరైన హామీ ఇవ్వలేదన్నారు. ఆకస్మికంగా లాక్ డౌన్ విధించడం, తర్వాత హటాత్తుగా మినహాయింపులు ఇవ్వడం ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.

Tags:    

Similar News