త్వరలో హోంమంత్రిని కలుస్తా

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు రఘురామ [more]

Update: 2021-03-20 00:56 GMT

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనపై అనవసరంగా కేసులు బనాయిస్తున్నారని, దీంతో తన నియోజకవర్గానికి వెళ్లలేకపోతున్నానని ఆయన రాష్ట్రపతికి వివరించారు. తాను ఇప్పటికే కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రపతి సూచన మేరకు త్వరలోనే తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలుస్తానని ఆయన తెలిపారు.

Tags:    

Similar News