ఎక్కడికక్కడ అరెస్ట్

రాజధాని అమరావతిని తరలించవద్దంటూ నేడు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన నేషనల్్ హైవే బంద్ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జేఏసీ నేతలను, టీడీపీ నాయకులను పోలీసులు [more]

Update: 2020-01-07 03:43 GMT

రాజధాని అమరావతిని తరలించవద్దంటూ నేడు అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చిన నేషనల్్ హైవే బంద్ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జేఏసీ నేతలను, టీడీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంట జేఏసీ ఈరోజు ఏడో నెంబరు జాతీయ రహదారిని ముట్టడించేందుకు సిద్ధమయిన సంగతి తెలిసిందే. నేషనల్ హైవే పై నాయకులు బైఠాయించకముందే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. బోండా ఉమ, దేవినేని ఉమలతో పాటు రైతు నేతలను పోలీసులు ముందుగా అదుపులోకి తీసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. నేషనల్ హైవేను పోలీసులు పహారా కాస్తున్నారు.

Tags:    

Similar News