పీవీని వర్ణించడానికి మాటలు చాలవు

దేశంలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ముఖ్మమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఏ రంగంలో ఉన్నా [more]

Update: 2020-06-28 06:01 GMT

దేశంలో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ముఖ్మమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఏ రంగంలో ఉన్నా పీవీ అక్కడ సంస్కరణలు తెచ్చారన్నారు. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణలను తెచ్చారన్నారు. తన కుటుంబానికి చెందిన 800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. పీవీ వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి మాటలు చాలవన్నారు. పీవీ తెలంగాణ ఠీవీ అని కేసీఆర్ కొనియాడారు. దేశంలో నవోదయ పాఠశాలలను తెచ్చిన ఘనత కూడా పీవీదేనని చెప్పారు. గెలుపు, ఓటముల్లో నిశ్చలంగా ఉండే వ్యక్తి పీవీ అని కేసీఆర్ తెలిపారు. పీవీ ప్రధాని అయ్యే సమయానికి ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంస్కరణలను తెచ్చి భారత్ ను నిలబెట్టారన్నారు.

Tags:    

Similar News